మణి మరియు సోము ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరోజు వారు అడవిలో నడుస్తుండగా, పొదల వెనుక నుండి ఒక పెద్ద నల్లటి ఎలుగుబంటి వారి వైపు రావడం చూశారు.
భయంతో సోము తన స్నేహితుడిని పట్టించుకోకుండా, పక్కనే ఉన్న ఒక ఎత్తైన చెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోయాడు. మణికి చెట్టు ఎక్కడం రాదు. అతను సోమును పిలిచినా సోము వినలేదు. మణి భయపడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. చనిపోయిన జంతువులను ఎలుగుబంట్లు ముట్టుకోవు అని అతను విన్నాడు.
వెంటనే మణి శ్వాస బిగబట్టి, చనిపోయినట్లుగా నేలపై పడుకున్నాడు. ఎలుగుబంటి నెమ్మదిగా మణి దగ్గరకు వచ్చి, అతన్ని వాసన చూసింది. మణి అస్సలు కదలకుండా ఉండటంతో, అతను చనిపోయాడనుకుని ఎలుగుబంటి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అపాయం పోయాక, సోము చెట్టు దిగి వచ్చాడు. అతను నవ్వుతూ, "ఎలుగుబంటి నీ చెవిలో ఏం రహస్యం చెప్పిందిరా?" అని అడిగాడు.
మణి నిలబడి, చాలా ప్రశాంతంగా, "ఎలుగుబంతి ఒక రహస్యం చెప్పింది. కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండకుండా పారిపోయే స్నేహితుడిని ఎప్పుడూ నమ్మవద్దు అని చెప్పింది," అన్నాడు. అది విన్న సోము తన తప్పు తెలుసుకుని సిగ్గుతో తలవంచుకున్నాడు.
Moral
ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు.